ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యం

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ సూచించారు. ముత్తారం, చింతగుట్ట, కేశవపట్నం, మొలంగూరు, మెట్‌పల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతు అవగాహన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలైన పెసర, మినుము, వేరుశనగ, కంది, మక్కజొన్న పంటలను సాగు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. భూగర్భ జలాలు, సాగునీటి వనరులు సమృద్ధిగా...