15 ఏళ్ల బాలికతో బలవంతపు క్షమాపణ:  రాహుల్ గాంధీ

శెనార్తి మీడియా, న్యూఢిల్లీ:  నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం బెదిరింపులతో అణచివేస్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల ఇళ్లకు వ్యక్తులను పంపించి ఒత్తిడి తెచ్చారని, 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణ చెప్పించారని ఆయన విమర్శించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. పారదర్శక విద్యా వ్యవస్థ కోసం పోరాడుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.