శెనార్తి మీడియా, శంకరపట్నం:
కరీంనగర్ జిల్లా కేశవపట్నంలోని గ్రామీణ బ్యాంకు, పాత సినిమా థియేటర్ పక్కన వర్షపు నీరు నిలిచిన నీటి కుంటలో అంబాలాపూర్ గ్రామానికి చెందిన రాణవేని శంకర్ (55) మృతదేహం లభ్యమైంది.
స్థానికుల సమాచారం మేరకు కేశవపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.