శెనార్తి మీడియా, శంకరపట్నం:
తల్లి మృతిచెందిన కొద్దిసేపటికే కూతురు కూడా మృతిచెందిన విషాద ఘటన శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొంగోని విజయ (55) బుధవారం తెల్లవారుజామున మృతి చెందగా, తల్లి మరణవార్త విని తీవ్రంగా కలత చెందిన ఆమె కూతురు బొంగోని మంజుల (38) కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కొద్దిసేపటి వ్యవధిలోనే తల్లి, కూతురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ముత్తారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు మృతుల కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.