శెనార్తి మీడియా, శంకరపట్నం:
మొలంగూర్ గ్రామంలోని అల్లయ్య కుంటలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందిన బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీల కుమారుడు రిత్విక్ (8) కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. పార్టీ కార్యకర్తల సహకారంతో సమీకరించిన రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రిత్విక్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచిస్తూ మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

