Friday, August 7, 2026
📄 ePaper
Homeలోకల్ న్యూస్ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి

ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

శెనార్తి మీడియా, శంకరపట్బం:

శంకరపట్నం మండల ఎంపీడీవో కార్యాలయంలో ఆగస్టు 5న నిర్వహించిన గ్రామ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని శంకరపట్నం సర్పంచుల మండల ఫోరం ఆరోపించింది. ఈ మేరకు మండల ఫోరం అధ్యక్షుడు కొయ్యడ పరుశురాములు, ప్రధాన కార్యదర్శి కొయ్యడ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

 సమావేశంలో సింగిల్ విండో చైర్మన్లను వేదికపై కూర్చోబెట్టడం,  వారికి సమీక్ష బాధ్యతలు అప్పగించి  సర్పంచులను అవమానించారని ఫోరం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SM News App

Add to home screen for faster loading and latest updates.