శెనార్తి మీడియా, శంకరపట్నం:
కేశవపట్నం గ్రామంలో ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ గెలల కొనుగోలు చేపట్టారు. రైతు గుజ్జు విజయ రాకేష్రెడ్డి సాగు చేసిన 6 ఎకరాల ఆయిల్పామ్ పంటకు ఇది తొలి కోత. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం టన్నుకు రూ.23 వేల చొప్పున గెలలను విక్రయించారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక లాభాలు అందించే ఆయిల్పామ్ సాగు వైపు మళ్లాలని అధికారులు సూచించారు.
కార్యక్రమంలో ఏఓ వెంకటేష్, ఏఈఓ స్రవంతి, ఆయిల్ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ జాకీ, రైతులు పాల్గొన్నారు.

