శెనార్తి మీడియా, వెబ్ డెస్క్:
రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు.
భారీ వర్షాల ప్రభావంతో రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండగా, ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

