Sankranthi ki Vasthunnam
Sankranthi ki Vasthunnam

SANKRANTHIKI VASTHUNAM : బాలీవుడ్‌లోకి ‘సంక్రాంతికి వస్తున్నాం

  • ఫ్లాఫ్ హీరోతో రీమేక్‌కు సిద్ధం

SANKRANTHIKI VASTHUNAM : టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్‌హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు అదే సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ రీమేక్‌లో హీరోగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించనున్నారని సమాచారం. ఒరిజినల్ చిత్ర నిర్మాత దిల్ రాజు హిందీ వెర్షన్‌కి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేయడం కొత్త విషయం కాదు. కానీ ఇటీవల పాన్-ఇండియా ట్రెండ్ పెరగడంతో రీమేక్‌లు తగ్గినా, కొన్ని ప్రత్యేక చిత్రాలను స్థానిక ప్రేక్షకుల రుచికి అనుగుణంగా మళ్లీ తెరకెక్కించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే కథను బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ ఇప్పటికే దక్షిణ భారత హిట్లను రీమేక్‌ చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు హిట్‌లు లేకపోవడంతో, ఈ చిత్రం మళ్లీ ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

అయితే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు అవసరమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. లేకపోతే హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, దిల్ రాజు మరోసారి హిందీ రీమేక్‌లపై ఆసక్తి చూపడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. “మళ్లీ అదే సూత్రం — హిట్ ఐతే హిందీ వెర్షన్” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

– శెనార్తి మీడియా, సినిమా డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *