VHP : పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను తక్షణమే ఆపాలని విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకులు డిమాండ్ చేశారు. శని వారం జాతీయ విశ్వహిందూ పరిషత్ పిలుపు మేరకు మంచిర్యాల కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ లో హిందువులకు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి విన్నవించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వహిందూ పరిషత్ (VHP) ఉపాధ్యక్షురాలు(VICE PRESIDENT) కనకతార, జిల్లా కార్యదర్శి(SECRETARY) వేముల రమేష్, జిల్లా గోరక్ష ప్రముఖ్ రాజసమ్మయ్య, జిల్లా సత్సంగ్ ప్రముఖ్ సురేష్, మాతృ శక్తి సంయోజక ముత్యం పద్మ, నగర సహకార్యదర్శి విద్యాసాగర్, హిందూ ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు బోయిన హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :