PM with Soliders
PM with Soliders

War Against Terror: ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో సైనికులతో ప్రధాని మోదీ

War Against Terror:  పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైన అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ ఆదంపూర్ ఎయిర్‌బేస్‌కి చేరుకుని సైనికులను కలిశారు. సైనికుల ధైర్య సాహసాలకు ప్రధాని అభినందనలు తెలిపారు.

ముందుగా సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ… సైనికుల శౌర్యానికి సెల్యూట్ చేశారు. “మన సైన్యం తన లక్ష్యాన్ని సాధించింది. ఉగ్రవాద నిర్మూలనలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం” అని స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక

ఉగ్రవాదానికి పాల్పడుతున్నవారికి ఆశ్రయం ఇస్తే, దాని తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌కు ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని, ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవవని స్పష్టం చేశారు. “నీరు, రక్తం కలిపే అవకాశమే లేదు” అన్నారు. పాక్‌తో ఏమైనా చర్చలు జరిగితే, అవి పీఓకే విషయంలో మాత్రమేనని మరోసారి తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ విజయవంతం

మే 6, 7 తారీఖుల రాత్రుల్లో భారత సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. పౌరులు, పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యం చేయలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. ఈ చర్యకు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *