drown in Godavari
drown in Godavari

drown in Godavari: బాసర గోదావరిలో మునిగి ఐదుగురు మృతి

drown in Godavari:నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాసర గోదావరిలోస్నానానికి వెళ్లిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. పడవలో గోదావరి నది మధ్యలోకి స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. గమనించిన భక్తులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతులంతా హైదరాబాద్‌లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

-శెనార్తి మీడియా, బాసర

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *