వర్షాలకు తడిసి నష్టపోతున్న యంత్రాలు
Paddy Cleaners: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు నిర్లక్ష్యం శికారమవుతున్నాయి. రైతుల ధాన్యాన్ని శుభ్రపరచేందుకు పంపిన ప్యాడీ క్లీనర్లు, కొందరు నిర్వాహకుల అసమర్ధత కారణంగా వర్షాలు తాకి తుప్పు పట్టి పనికిరాని స్థితికి చేరాయి.
కొన్ని కేంద్రాల్లో వాడిన తర్వాత మళ్లీ మార్కెట్ కమిటీలకు అప్పగించకుండా బయటే వదిలిపెట్టడం వల్ల ఇవి నష్టపాలవుతున్నాయి. జిల్లాలో సుమారు వందకు పైగా ప్యాడీ క్లీనర్లు పంపిణీ చేసినప్పటికీ, వాటిలో 90 శాతానికి పైగా తిరిగి అప్పగించలేదని సమాచారం.
పరికరాల్లో భాగమైన మోటార్లు దెబ్బతిన్నాయి. కొన్నింటిని చోరీ చేసిన ఘటనలూ జరిగాయి. మార్కెటింగ్ శాఖ వేలాది రూపాయల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఈ నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్లో ఉపయోగించాల్సిన పరికరాల నిర్వహణలో అలసత్వం చూపడం వల్ల ప్రభుత్వానికే నష్టం కలుగుతోందని వారు విమర్శిస్తున్నారు.

ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశాం
“అన్ని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశాము. ఈ నెల 30 లోగా ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్ కవర్లు, కంట మెషిన్ లను సంబంధిత మార్కెట్ కమిటీలకు తిరిగి అప్పగించాలని ఆదేశించాం. ఇది పాటించని ఏజెన్సీలకు కమీషన్ నుండి కోత విధిస్తాం,” అని మార్కెటింగ్ ఏ డి శాబుద్దీన్ తెలిపారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల