KERALA ELECTRICITY OFFICIALS : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో శనివారం ఆర్కే-7 గనిని కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుల బృందం సందర్శించింది. ఈ బృందానికి చీఫ్ ఇంజనీర్ రాజన్ ( CHIEF ENGINEER RAJAN) నేతృత్వం వహించారు. వారిని ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్ (AGENT RAJENDER), గని మేనేజర్ తిరుపతి (RK-7 MANAGER THIRUPATHI) స్వాగతం పలికారు. అనంతరం గనిలోకి ప్రవేశించిన బృందం అక్కడి వాతావరణ పరిస్థితులు, బొగ్గు తవ్వే విధానాలు, ఉద్యోగుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

గనిలో రక్షణ ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎస్డిఎల్ యంత్రాల ద్వారా ఉత్పత్తిని మెరుగుపరుస్తున్న విధానాలను ఆర్కే-7 అధికారులు వివరించారు. ఆర్కే-7 ఏజెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, బొగ్గు ఉత్పత్తి, ఉద్యోగుల భద్రత, పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ తిరుపతి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఇంజనీర్ రాజా రవి చరణ్, రక్షణ అధికారి సంతోష్ రావు, కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సభ్యులు వీ. లత, కే. అనిత తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :