కేరళ బృందంతో ఆర్కే 7 అధికారులు
కేరళ బృందంతో ఆర్కే 7 అధికారులు

KERALA ELECTRICITY OFFICIALS : ఆర్కే-7 గనిపై కేరళ ఎలక్ట్రిసిటీ అధికారుల పర్యటన

KERALA ELECTRICITY OFFICIALS : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో శనివారం ఆర్కే-7 గనిని కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుల బృందం సందర్శించింది. ఈ బృందానికి చీఫ్ ఇంజనీర్ రాజన్ ( CHIEF ENGINEER RAJAN) నేతృత్వం వహించారు. వారిని ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్ (AGENT RAJENDER), గని మేనేజర్ తిరుపతి (RK-7 MANAGER THIRUPATHI) స్వాగతం పలికారు. అనంతరం గనిలోకి ప్రవేశించిన బృందం అక్కడి వాతావరణ పరిస్థితులు, బొగ్గు తవ్వే విధానాలు, ఉద్యోగుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

కేరళ బృందంతో ఆర్కే 7 అధికారులు
కేరళ బృందంతో ఆర్కే 7 అధికారులు

గనిలో రక్షణ ప్రమాణాలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎస్డిఎల్ యంత్రాల ద్వారా ఉత్పత్తిని మెరుగుపరుస్తున్న విధానాలను ఆర్కే-7 అధికారులు వివరించారు. ఆర్కే-7 ఏజెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో, బొగ్గు ఉత్పత్తి, ఉద్యోగుల భద్రత, పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కే-7 గ్రూప్ ఏజెంట్ రాజేందర్, గని మేనేజర్ తిరుపతి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ఇంజనీర్ రాజా రవి చరణ్, రక్షణ అధికారి సంతోష్ రావు, కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సభ్యులు వీ. లత, కే. అనిత తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *