- భీమారం ఎస్ఐ కే. శ్వేత
CYBER : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని భీమారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ కే శ్వేత అన్నారు. శుక్ర వారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్రాంతి సెలవులలో బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో ఎటు వెళుతున్నారనేది పెట్టవద్దని, చాలా వరకు సోషల్ మీడియకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఆకతాయిల ఇబ్బంది పెడితే 100 డయల్ చేయాలని సూచించారు. అనంతరం ఆడ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై వివరంగా తెలియజేశారు. ఆకతాయిల నుంచి, మరే ఇతర వేధింపులకు గురవుతున్న మహిళలు 6303923700 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం ఇచ్ఛిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
– శెనార్తీ మీడియా, మంచిర్యాల