- ఎమ్మెల్సీ పోలింగ్లో చోటు చేసుకున్న ఘర్షణ
- తీగల్ పహాడ్లో ఘటన
- పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి
Political Fight : మంచిర్యాల జిల్లా నస్పూర్ తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీచర్(Teachers), పట్టభద్రుల(Graduates) ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ, కాసేపటికే రాజకీయ హింస (Political Fight) రాజుకుంది.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీజేపీ నేతలు పోలీసులను నిలదీశారు. కాంగ్రెస్కు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు తిట్ల దండకం అందుకున్నాయి.
దీంతో బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు.

ఈ గందరగోళాన్ని ఆసరాగా తీసుకున్న అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. తీవ్రత పెరుగుతుండడంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్(Ramagundam CP), మంచిర్యాల డీసీపీ(Mancherial DCP) భాస్కర్, ఏసీపీ ప్రకాష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లరి మూకలను చెదరగొట్టి, ఇరువర్గాలను కంట్రోల్ చేశారు.
ఈ ఘటనపై రామగుండం కమిషనర్ శ్రీనివాస్ స్పందించారు. అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల శాంతి భద్రతలను భంగం కలిగించే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రం(Poling Station) వద్ద చోటుచేసుకున్న ఈ రాజకీయ ఉద్రిక్తత మరింత ఆందోళనకు దారితీసింది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల