PDS RICE
PDS RICE

PDS : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా

  • 12 క్వింటాళ్లు స్వాధీనం

PDS : మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కలమడుగు కొమరం భీమ్ చౌరస్తా వద్ద ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇంద్రవెల్లి వైపు వెళ్తున్న ఆటో ట్రాలీ (ఏపీ 01వై 5675) లో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ గుర్రాల రాజేందర్‌ను అదుపులోకి తీసుకుని, సుమారు 36 వేల రూపాయల విలువైన 12 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం జన్నారం పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, జన్నారం పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *