Re Union: నల్లగొండలోని మమత హైస్కూల్ పదో తరగతి (1991–92 బ్యాచ్) పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. 32 ఏళ్ల తర్వాత జరిగిన ఈ కార్యక్రమంలో బాల్యపు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఆ నాటి ఉపాధ్యాయులు కూడా హాజరై తమ శిష్యులు వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉండటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని రెడ్డిపల్లి యాదగిరి, శ్రీపతి యాదయ్య, నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఖవీ తదితరులు కలసి నిర్వహించారు. మమత హైస్కూల్ కరస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, సలీం, చంద్రశేఖర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శేఖర్రెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
శెనార్తి మీడియా, నల్లగొండ: