CM Cup-2024 :సీఎం కప్ – 2024 పోటీలు మూడో రోజైన గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కొనసాగాయి. జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్ వీరు, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి హాజరై చెస్ ఆడి పోటీలను కలెక్టర్ కుమార్ దీపక్ ఆడి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై, అక్కడ కూడా రాణించాలని ఆకాంక్షించారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు విద్య, ఉపాధి రంగాలలో రాణించేందుకు ఏకాగ్రత పెంపొందుతుందని, జీవితంలో ఎంచుకున్న ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడుతుందని అన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, శిక్షకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల