- కోటి సంతకాల సేకరణ ప్రారంభించిన బీసీ సంఘం నాయకులు
EWS Reservations: మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక పరమైన రిజర్వేషన్లు
చెల్లవని సుప్రీంకోర్టు 1993లో ఇంద్రసహాని కేసులో తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ కేంద్రం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అగ్రవర్ణాలకు అందించడం అంటే బీసీలకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. దేశ జనాభాలో 60 శాతం, రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో బీసీలకు 11 శాతం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు 9 శాతం అంటే ఇది కదా బీసీలపై వివక్ష అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అక్కల రమేష్, గౌరవ అధ్యక్షులు కర్రే లచ్చన్న, సీనియర్ నాయకులు శాకాపురి భీమ్సేన్, రామగిరి రాజన్న చారి,, అంకం సతీష్, షేక్ సల్మాన్, జంగిల్ గట్టయ్య, మామిడిశెట్టి వెంకటేష్, తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.