DMHO : కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. హాజరు పట్టిక, అవుట్పేషెంట్ రిజిస్టర్లు సహా ఇతర రికార్డులను పరిశీలించారు.
ఆరోగ్య కేంద్ర పరిశుభ్రతను తనిఖీ చేసి ప్రతి వేళా శుభ్రత పాటించాలని సూచించారు. ఎన్సీడీ క్లినిక్లో రెడ్ పుస్తకం, బ్లూ పుస్తకాలను పరిశీలించి, హై బీపీ, షుగర్ బాధితులకు మందుల సరఫరా విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీ స్టోర్స్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వను, ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గదిలో ఉన్న అత్యవసర మందుల సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
మొదటి కాన్పు సిజేరియన్ చేయించుకుంటే వచ్చే సమస్యలపై అవగాహన కల్పించి, సాధారణ డెలివరీల కోసం గర్భవతులు, వారి కుటుంబసభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆశ్రయించాలని తెలిపారు.
తర్వాత బిఎంఎస్ వైద్యులకు ఫీల్డ్ ట్రైనింగ్లో భాగంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పిఓఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా, కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ నజియా, డిపిఓ ఎన్హెచ్ఎం స్వామి, సాగర్, బిఎంఎస్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్