కాలనీలో వీధి బోర్డుల ఏర్పాటు…
STREET BOARDS : మాతరం వెల్ఫేర్ అసోసియేషన్ (MAATARAM WELFARE ASSOCIATION) ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సింగరేణి రిటైర్డ్ మెంట్ కాలనీ (SINGARENI RETIREMENT COLONY) పరిధిలో ఉన్న వీధుల గుర్తుంపు కోసం వీధి బోర్డు (STREET BOARDS) లను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ కార్యాలయ ఆవరణలో ఆది వారం అసోసియేషన్ అధ్యక్షులు (PRESIDENT) ఆరె తిరుపతి (AARE THIRUPATHI) అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం, ప్రణాళిక బద్ధంగా చేపట్టబోయే అభివృద్ధి పనులపై సమీక్షించారు. అనంతరం కాలనీలోని అన్ని వీధుల్లో వీధి బోర్డులను ఏర్పాటుకు భూమి పూజ చేసి అమర్చారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వంగ తిరుపతి, ఎంబడి సమ్మయ్య, మేడం తిరుపతి, ప్రధాన కార్యదర్శి పెరుక ప్రతాప్, కోశాధికారి రామంచి సంపత్, ఉపాధ్యక్షులు బెడద మహేందర్, సంయుక్త కార్యదర్శి హరిధాస్యపు వేణుగోపాల స్వామి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు నాంపల్లి తిరుపతి, లగిశెట్టి గంగాధర్, గడ్డం సుధాకర్, అన్నం రాజ్ కుమార్, సంతోష్ చారి, పెంచాల వేణు, కానవేని ఓదెలు, గాండ్ల సుధీర్, రేగళ్ల ఉపేందర్, చాతరాజు రవి, గొట్టిపర్తి రాములు, సల్ల లక్ష్మా రెడ్డి, ఆడెపు శ్రీనివాస్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
