- వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం
- మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్
- నర్సాపూర్(బెజ్జాల)లో పోలీస్ మీకోసం కార్యక్రమం
Police : మంచిర్యాల జిల్లా మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో “పోలీస్ మీకోసం” కార్యక్రమం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన కుటుంబాలకు దుప్పట్ట్లు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, చీరలు, దోతులు, లుంగీలు పంపిణీ చేశారు.
ముందుగా గ్రామస్తులు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ను సంప్రదాయ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడారు. ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని, తమ పిల్లలను చక్కగా చదివించాలన్నారని సూచించారు. గిరిజనులు విద్య, వైద్యం, ఉపాధి అవకాకాశాలను వినియోగించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. తమ సమస్యల పరిష్కారానికి నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తాండూర్ సీఐ కుమార్ స్వామి, మాదారం ఎస్ఐ సౌజన్య, తాండూర్ ఎస్ఐ కిరణ్, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల