- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
MLA PSR : మంచిర్యాల నియోజక వర్గాన్ని అభివృద్ది పథంలో ముందుంచుతానని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం మంచిర్యాల మార్కెట్ లోని వ్యాపార ప్రాంతాల్లో రోడ్ విస్తరణ, అండర్ డ్రైనేజీ నిర్మాణ ప్రణాళికను, కాలేజ్ రోడ్ లో నిర్మిస్తున్న వైకుంఠ ధామం నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజక వర్గ అభివృద్ధి కోసం ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. మంచిర్యాల ప్రధాన మార్కెట్ రోడ్, మెయిన్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాంకు రోడ్ లలో భూగర్భ మురికి కాలువలు, ఫుట్ పాత్ ల నిర్మాణం చేపడుతామన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి అభివృద్దిలో ముందుంచానన్నారు. మంచిర్యాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డి అభినందించారని, భూగర్భ మురికి కాలువలు, కేబుల్ వ్యవస్థ గురించి విన్న సీఎం రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో ఇదే ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారని వెల్లడించారు. నియోజక వర్గ ప్రజలు అభివృద్ధికి సహకరించాలని, అడ్డుకోవద్దని కోరారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల