SI SHANKAR
పట్టుబడిన ఎస్సై రూపావత్ శంకర్

SI CAUGHT BY ACB :  రూ. 5 వేల లంచానికి…

  • కెరీర్ తాకట్టుపెట్టుకున్న కోరుట్ల ఎస్సై

SI CAUGHT BY ACB : మరికొన్ని నెలల్లో పదవీ విరమణ పొందాల్సిన కోరుట్ల ఎస్సై రూపావత్ శంకర్ (60) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. జూదం కేసులో నోటీసుల కోసం బాధితుడిని సంప్రదించి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

జోగినపల్లి శివార్లలో జూదం ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్ కేసు నమోదు చేయగా, వారిలో ఒకరికి BNSS యాక్ట్ 35 ద్వారా నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, అతని వద్ద లంచం కోరాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటున్నప్పుడు శంకర్‌ను పట్టుకున్నారు.

కెమికల్ టెస్ట్‌లోనూ లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో అతడిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. కేవలం నాలుగు నెలల్లో రిటైర్డ్ కావాల్సిన ఎస్సై ఇప్పుడు జైలు జీవితం ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. లంచం కేసు కారణంగా సర్వీస్ బెనిఫిట్స్ రద్దయ్యే అవకాశం ఉండగా, తక్షణం బెయిల్ కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. మామూలు 5 వేల రూపాయల లంచానికి తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

– శెనార్తి మీడియా, జగిత్యాల:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *