కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూన్నాలుగా రోజులుగా ధిక్కార స్వరం వినిపిస్తున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలే తనను ఓడించారంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. కవిత వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. కవిత తిరుగుబాటుపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు ప్రతిపాదను తీసుకువచ్చారని కవిత చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ తీరు చార్పత్తా ఆటను తలిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. కవిత తిరుగుబాటు కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా అని కొట్టి పడేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ డ్రామా నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల సినిమాను కాంగ్రెస్ వెనకుండి నడిపిస్తున్నదని ఆరోపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవు అని స్పష్టం చేశారు. కవిత అరెస్ట్ అవ్వకుండా ఉండటానికి బీఆర్ఎస్ బీజేపీతో కలిసేందుకు ప్రయత్నించిందని అన్నారు.
బీఆర్ఎస్ బీజేపీతో కలిసేందుకు వచ్చిందని కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనని స్పష్టం చేశారు. కానీ అవినీతి బీఆర్ఎస్ తో బీజేపీ ఎన్నటికీ కలవబోదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్.. కాంగ్రెస్ కలిసి పని చేశాయని అన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపణలు చేశారు.