సీపీఐ నాయకులు నిరసన
సీపీఐ నాయకులు నిరసన

NREGS: ఏడు వారాలైనా కూలీ డబ్బులిస్తలేరు..

  • సీపీఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం
  • కూలీ బకాయిలు చెల్లించాలంటూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన

NREGS: గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు గత ఏడు వారాలుగా కూలీ డబ్బులు ఇవ్వడం లేదని సీపీఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం అన్నారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం గన్నేరువరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో కూలీలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడారు. గతంలో ఈజీఎస్ పనులు చేసిన కూలీలకు పది నుంచి పదిహేను రోజుల్లో డబ్బులు జమయ్యేవని చెప్పారు. అయితే ఇప్పుడు ఏడు వారాలు గడుస్తున్నా కూలి డబ్బులు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నిత్యావసరాల కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎండలో వసతులు లేకుండానే పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని గ్రామాల్లో కూలీల జాబ్ కార్డులు తొలగిస్తున్నారని ఆరోపించారు. పని కోసం పలుమార్లు అధికారులను ఆశ్రయించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, జిల్లా నాయకులు కాంతలా అంజిరెడ్డి, సహాయ కార్యదర్శులు పిప్పల కనుకయ్య, కూన మల్లయ్య, యువజన నాయకులు మొల్గురి ఆంజనేయులు, గుండ్లపల్లి గ్రామ శాఖ కార్యదర్శి బోయిని తిరుపతి, బోయిని మల్లయ్య, దామా సంపత్, కూన ఎల్లయ్య, ఎండీ నాయ్యిమ్ తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, గన్నేరువరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *