PALABHISHEKAM : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి (CM) రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి (Dy. CM) బట్టి విక్రమార్క మంచిర్యాల ఎమ్మెల్యే (MLA) ప్రేం సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజక వర్గాలకు రూ. 600 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మంచిర్యాల నియోజక వర్గం దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు రూ. 200 కోట్లు కేటాయించినందుకు నియోజక వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల :