DCP
క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న డీసీపీ భాస్కర్

DCP HUMANITY : మానవత్వాన్ని చాటిన డీసీపీ

  • ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలింపు

DCP HUMANITY : మంచిర్యాల నుంచి లక్షేట్టిపేట జాతీయ రహదారిపై హాజీపూర్ మండలం వేంపల్లి వద్ద బుధ వారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళా ప్రమాదం బారిన పడింది. అదే సమయంలో అటుగా వెళుతున్న మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ మానవత్వంతో వెంటనే తన వాహనాన్ని ఆపి మహిళకు తగిలిన గాయాలను పరిశీలించారు.
మహిళను వెంటనే ఆటోలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరును మంచిర్యాల ఏరియాసుపత్రి సూపరింటెండెంట్ కు స్వయంగా ఫోన్ చేసి ప్రమాదం గురించి మాట్లాడారు. డీసీపీ స్వయంగా వాహనం ఆపి క్షతగాత్రురాలిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించడంపై, స్పందించిన తీరుపై వాహనదారులు, ప్రజలు హార్షం వ్యక్తం చేశారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *