- గురువులకు ఆత్మీయ సత్కారం, చిన్ననాటి జ్ఞాపకాల్లో మునిగిన పూర్వ విద్యార్థులు
Re-Union Aulumini: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని నవాబుపేట ప్రభుత్వ పాఠశాల 1999–2000 పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 70 మంది విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై మళ్లీ కలుసుకున్నారు.
చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న పాఠశాల ఆవరణలోనే ఈ కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా ద్వారా సమీకృతమైన వారు మునుపటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. చిన్ననాటి అల్లరి పనులు, ఆ రోజుల్లోని అనుభూతులు, ప్రస్తుతం వారి ఉద్యోగాలు, కుటుంబ జీవితం తదితర విషయాలపై పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
నాడు చదువు చెప్పిన గురువులను ఆహ్వానించి శాలువాలతో సత్కరించారు. వారికి మెమెంటోలు అందజేసి ఆశీస్సులు పొందారు. అనంతరం సహపంక్తి భోజనాలతో ఆనందంగా గడిపారు. ఇకపై ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా పరస్పరం తోడుగా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు.
ఈ వేడుకల్లో గురువులు రాజిరెడ్డి, లింగారెడ్డి, హరికిషన్, అంజిరెడ్డి, శ్రీవాణి పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల్లో సిద్దుల సుదర్శన్ యాదవ్, చెప్యాల శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ మక్బుల్ పాషా, బోయిని సంపత్, గుళ్ల కిష్టయ్య, బత్తిని వెంకటేశ్వర్, కూతురు రాజిరెడ్డి, కర్నాల శ్రీనివాస్, గుళ్ల తిరుపతి, కూతురు శ్రీకాంత్ రెడ్డి, దామ శ్రీనివాస్, బుర్ర రాజు, బుర్ర శ్రీనివాస్, జాగిరి కుమారస్వామి, చంద్రశేఖర్, గుళ్ల శ్రీకాంత్, బత్తిని శ్రీను, రజిత, జోష్ణ, వీరవనిత, సుజాత, అనిత, సరళ, శ్రీలత, సబిత తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, చిగురుమామిడి