maoists
maoists

Maoists: 12 మంది మావోయిస్టుల లొంగుబాటు

Maoists: ఆపరేషన్ చేయూతకు ఆకర్షితులై అరణ్యాన్ని విడిచి మావోయిస్టులు సామాన్యజీవితానికి అడుగుపెడుతున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. వివిధ స్థాయిలలో పని చేసిన 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 9 మంది పురుషులు, 3 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారి నుంచి 12 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు, 81 & 141 సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లు ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూతకు మంచి స్పందన వస్తోందన్నారు.

ప్రస్తుతం మావోయిస్టు సాయుధ దళాల సంచారం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొనసాగుతోందని, అక్కడి గ్రామ ప్రజలు మావోయిస్టులకు సహకరించవద్దని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 294 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. మరెవరికైనా లొంగిపోవాలనుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్‌ లేదా కుటుంబ సభ్యుల ద్వారా అధికారులను సంప్రదించి సామాన్యజీవితంలో భాగమయ్యేందుకు ముందుకు రావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *