GIRI PRADHIKSHNA AT VELALA TEMPLE
GIRI PRADHIKSHNA AT VELALA TEMPLE

GATTU MALLANNA : ఘనంగా ‘వేలాల’ గట్టు మల్లన్నగిరి ప్రదక్షిణ

GATTU MALLA TEMPLE
GATTU MALLA TEMPLE

ఆలయంలో కిటకిటలాడుతున్న భక్తులు

GATTU MALLANNA : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ సోమ వారం భక్త జనుల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రతి నెలా ఆరుద్ర నక్షత్రాన నిర్వహించే గిరి ప్రదక్షిణ రాజేశ్ శర్మ అయోధ్య నుంచి తీసుకువచ్చిన శ్రీరాముని పాదుకలతో ఒగ్గు కళాకారులు, డీజే సౌండ్ సిస్టం మధ్య అంగరంగ వైభవంగా జరిపారు.

GIRI PRADHIKSHANA
GIRI PRADHIKSHANA

గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు

సురేష్ ఆత్మారావు మహారాజ్ జీ ఆధ్వర్యంలో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం కాగా సోమ వారం నిర్వహించిన ప్రదక్షిణ మూడవది. శ్రీరాముని పాదుకలతో గుట్ట చుట్టూ భక్త జనులు తిరిగి ఆలయంలోని మల్లన్నను దర్శించుకున్నారు. సుమారు వెయ్యి మందికిపైగా భక్తులు పాల్గొనగా వారందరికి గుట్టపైనే అన్నదానం నిర్వహించారు. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ మంచిర్యాల నుంచి ప్రత్యేక వాహనాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చొప్పకట్ల శ్రీకాంత్, గిరి ప్రదక్షిణ కమిటీ సమితీ సభ్యులు రాజేశ్ శర్మ, కర్ణకంటి రవీందర్, ప్యాగ లక్ష్మణ్, డేగ నగేష్ పటేల్, రాజా రమేష్, రాఘవేంద్ర స్వామి, సదనపు సంతోష్, రమేష్ గౌడ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు రవీందర్, చత్రపతి శివాజీ సేవా సమితి వ్యవస్థాపకులు ఉదయ్ కిరణ్, వేలాల గ్రామ స్పెషల్ ఆఫీసర్ విద్యా సాగర్, సీపీఓ సత్యంతో పాటు అధికారులు, నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *