- మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
SUDDEN INSPECTION : బాధితులకు ఎల్లప్ఫుడు పోలీసులు అందుబాటులో ఉంటు, వారికి నమ్మకంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిసిపి పోలీసులనుద్దేశించి మాట్లాడారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చే భాదితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యను క్షుణ్ణంగా ఓపికతో వినాలని సూచించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని కాలనీలలో నిత్యం పెట్రోలింగ్ చేస్తూ దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. దొంగతనాల నివారణకు అన్ని వార్డుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా కాలనీ వాసులకి జరిగే మేలును వివరించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, ఆక్సిడెంట్లు జరగడానికి గల కారణాలను పరిశీలించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది పని తీరుతో పాటు వారి ఆరోగ్య పరిస్థుతులు, వెల్ఫేర్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్, ఎస్ ఐలు సంతోష్, లక్ష్మీ ప్రసన్న, పోలీసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :