CRT Movement: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంటాక్ట్ టీచర్స్ సంఘం ఆధ్వర్యంలో వారి సమస్య లను పరిష్కరించాలని ఐటీడీఏ ఉట్నూర్ లో జరుగుతున్న నిరవధిక సమ్మెకు పిఆర్టియు తెలంగాణ అదిలాబాద్ జిల్లా ఉపాధ్యాయ సంఘ సభ్యులు బుధవారం సమ్మె లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నూర్ సింగ్, నర్రా నవీన్ యాదవ్ లు మాట్లాడుతూ సంఘ వ్యవస్థపాక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో సీఆర్టీ ల సమస్యలు పరిష్కరించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని. ఉద్యోగ భద్రత తో పాటు ఆరోగ్య భీమా జీవిత బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని. పిఎఫ్ సౌకర్యం కల్పించాలని. పై సౌకర్యాలను ప్రభుత్వం మానవతా కోణంతో ఆలోచించి మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న సిఆర్టి ఉపాధ్యాయుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.. ధర్నా కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనక అభిమాన్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు సునీల్ కుమార్ , రాథోడ్ రవీందర్, నార్నూర్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, ఆదిలాబాద్