Ayodhya: మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటారని అంచనా. ప్రయాగ్ రాజ్- అయోధ్య మధ్య 168 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో, అనేక మంది భక్తులు సంగమంలో పుణ్య స్నానం చేసిన అనంతరం రాముడి దర్శనానికి అయోధ్యకు వెళ్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మరో 15 రోజుల వరకు అయోధ్యకు రావొద్దని కోరారు. ఇతర ప్రాంతాల భక్తులు 15 రోజుల తర్వాత మాత్రమే అయోధ్యకు రావాలని సూచిస్తున్నారు.
మౌని అమావాస్య ప్రధాన స్నానం ప్రయాగ్రాజ్లో జనవరి 29న మహాకుంభంలో ఉంటుంది. ఈ రోజు దాదాపు 10 కోట్ల మంది గంగాస్నానం చేస్తారని అంచనా. ప్రయాగ్రాజ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ప్రయాగ నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో భక్తులు అయోధ్యకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. గత మూడు రోజులుగా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అయోధ్య ధామం జనాభా, విస్తీర్ణం చూస్తుంటే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు ఒక్కరోజులో రాంలాల దర్శనం చేసుకోవడం చాలా కష్టమని, భక్తులకు ఇబ్బందులు తప్పవని చంపత్ రాయ్ పేర్కొంటున్నారు . దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు కాస్త సంయమనం పాటించాలని కోరుతున్నారు. కావున, సమీప పరిసరాల భక్తులు 15-20 రోజుల తర్వాత దర్శనం కోసం అయోధ్యకు రావాలని అభ్యర్థిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా రాంలాల దర్శనం చేసుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల అందరికీ సౌకర్యంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వసంత పంచమి తరువాత, ఫిబ్రవరి లో స్వామి దర్శనానికి వెసులుబాటు ఉంటుందని, వాతావరణం కూడా మరింత అనూలంగా ఉంటుందని చెబుతున్నారు. దయచేసి తమ ఈ అభ్యర్థనను పరిగణించాలని కోరుతున్నారు.
పుణ్య స్నానాలకు 44 ఘాట్ల అభివృద్ధి
మౌని అమావాస్యకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన 44 ఘాట్లలో స్నానాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఘాట్ల వద్ద ఎస్డీఎంతో పాటు సీఓ, తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్లకు విధులు కేటాయించారు. ఘాట్లపై ఐఏఎస్-ఐపీఎస్లను కూడా రంగంలోకి దించారు. సంగం తీరంలోని ఘాట్లతో పాటు ఐరావత్ ఘాట్, ఆరైల్ ఘాట్ వద్ద ఐఏఎస్ అధికారులు, ఏడీఎం, ఎస్డీఎం ర్యాంక్ పీసీఎస్ అధికారులను మోహరించారు. ఇది కాకుండా, ప్రయాగ్రాజ్ చుట్టూ ఉన్న 10 జిల్లాల డీఎం, ఎస్పీలను కూడా నియమించారు.
నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేసింది. మౌని అమావాస్య స్నానోత్సవం సందర్భంగా ప్రయాగ్రాజ్ నగర ప్రజలు నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగించవద్దని డీఎం ప్రయాగ్రాజ్ రవీంద్ర కుమార్ మందార్ ఎక్స్లో పోస్ట్ ద్వారా కోరారు. ప్రయాగ ప్రజలు నాలుగు చక్రాల వాహనాలను ఉపయోగించవద్దని, ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా సహకరించాలని పిలుపునిచ్చారు.