పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

CP RAMAGUNDAM : రామగుండంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధం కొనసాగింపు

CP RAMAGUNDAM : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారికి ముందే అమలులో ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించారు. మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలో మద్యం సేవించి వీధుల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయని, మహిళలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. దీనిని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నిషేధం 2025 జూన్ 1 నుండి జూలై 1 వరకు అమల్లో ఉంటుందని, అవసరమైతే కాల పరిమితిని పొడిగించే అవకాశముందని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

డీజే, డ్రోన్ వినియోగంపై పరిమితులు కొనసాగింపు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ల పరిధిలో డీజే సౌండ్స్, అనుమతి లేని డ్రోన్ల వినియోగంపై నిషేధాన్ని పొడిగించినట్టు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల‌కు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో భారీ శబ్దాలు చేసే డీజేలపై కఠినంగా వ్యవహరించనున్నారు. ప్రజలు నిర్వహించే కార్యక్రమాలకు మైక్‌సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ నిషేధాన్ని 2025 జూన్ 1 (JUNE 1) నుంచి జూలై 1 (JULY 1) వరకు అమలు చేస్తారని వెల్లడించారు.

సిటీ పోలీస్ యాక్ట్ అమలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 జూన్ 1 ఉదయం 6 గంటల నుంచి జూలై 1 ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కమిషనర్ తెలిపారు. ఈ వ్యవధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *