డాక్యుమెంట్ అందజేస్తున్న సబ్ రిజిస్టర్ సాయి కుమార్
డాక్యుమెంట్ అందజేస్తున్న సబ్ రిజిస్టర్ సాయి కుమార్

SLOT BOOKING : లక్సట్టిపేట్లో స్లాట్ బుకింగ్ అమలు..

  • 15 నిమిషాల్లోపు పూర్తికానున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ
  • తగ్గనున్న పని భారం.. నిరీక్షణకు తెర

 

SLOT BOOKING : లక్సట్టిపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ పద్ధతి ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఏప్రిల్ 10న శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొదటగా 22 సబ్ రిజిస్ట్రార్ (22 SUB-REGISTRAR OFFICE) కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. మే 12న ఈ కార్యక్రమాన్ని ఇంకా 25 కార్యాలయాల్లో ప్రారంభించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లక్సట్టిపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ విధానం పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమయం ఆదా స్లాట్ విధానంతో కేవలం 15 నిమిషాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. గంటల తరబడి కార్యాలయాల్లో క్రయ విక్రయదారులు నిరీక్షించాల్సిన తిప్పలు తప్పనున్నాయి.

సబ్ రిజిస్టర్ సాయి కుమార్
సబ్ రిజిస్టర్ సాయి కుమార్

-ఇబ్బందులు కలగకుండా.. సాయి కుమార్ సబ్ రిజిస్ట్రేర్ లక్సట్టిపేట్

సోమవారం స్లాట్ బుకింగ్ విధానంతో 6 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. 15 నిమిషాల్లోపు (15 MIN REGISTRATION) రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. క్రయ విక్రయదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ప్రజలు స్లాట్ బుకింగ్ విధానంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *