- జాతీయ క్షయ నివారణ, హెచ్ఐవి పై అవగాహన కల్పణ..
- సీజనల్ వ్యాధుల నివారణకు రాపిడ్ రెస్పాన్స్ టీములు ఏర్పాటు..
- వైద్య సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ..
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజు
MEDICAL CAMP : మంచిర్యాల జిల్లాలో 100 రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పాత మంచిర్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ క్షయ నివారణ, హెచ్ఐవి/ఎయిడ్స్, అసంక్రమణ వ్యాధులు, హెపటైటిస్ బి, సి తదితరాలపై పరీక్షలు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, వారంలో నాలుగు రోజులపాటు నెలకు 16 రోజులు (MONTHLY 16 DAYS) ఈ శిబిరాలు జరుగుతాయని పేర్కొన్నారు.

వైద్య అధికారులకు, సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజు (DM & HO HARISH RAJ) కొన్ని కీలక సూచనలు చేశారు. వంద రోజుల పాటు ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆశా కార్యకర్తలు, స్థానిక నేతల సహకారం తీసుకోవాలని, శిబిరాల వివరాలను ముందుగా తెలియజేయాలని తెలిపారు. రాపిడ్ రెస్పాన్స్ టీములను ఏర్పాటు చేసి, సీజనల్ వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామస్థులు, ఆశా కార్యకర్తలు, ఎన్జీవోలు, ఆరోగ్య కార్యకర్తలతో పాటు హెచ్ఐవి/ఎయిడ్స్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి మద్దతు అందించారు. ప్రజలు పరిశుభ్రమైన నీటిని తాగాలని, రోడ్లపై అమ్మే ఆహార పదార్థాలు తినకూడదని సూచించారు. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరగే అవకాశమున్నందున మాస్కులు ధరించడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన వివరించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 102 సిబ్బంది, ఆర్బీఎస్కే, ఐసిటిసి సేవలను సమన్వయంతో అందించాలని జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శివ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల :