టచ్ హాస్పిటల్లో 95% బ్లాకేజ్కు స్టెంట్ విజయం
HEART TREATMENT : తీవ్ర ఛాతీ నొప్పితో టచ్ హాస్పిటల్ను ఆశ్రయించిన సరోజ అనే రోగికి హార్ట్ఎటాక్ అని వైద్యులు నిర్ధారించారు. కార్డియోలాజిస్ట్ డా. రాజేష్. బి (DR. RAJESH B) నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర పరీక్షలు నిర్వహించి, గుండెలో ప్రధాన రక్తనాళంలో 95 శాతం బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ స్థాయిలో ఉన్న బ్లాకేజ్లకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారు. టచ్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్న అధునాతన ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ (IVUS) కెమెరా గైడెడ్ టెక్నాలజీ ద్వారా సర్జరీ లేకుండా స్టెంట్ ను విజయవంతంగా అమర్చారు. చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకోవడంతో, ఆమె బంధువులు హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డా. రాజేష్. బి మాట్లాడుతూ… హార్ట్ఎటాక్ వచ్చినప్పుడు ప్రతీ నిమిషం విలువైనది. మెరుగైన సదుపాయాలు, సకాలంలో చికిత్సే పేషెంట్ ప్రాణాలను కాపాడగలవు అని పేర్కొన్నారు.
హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడుతూ.. టచ్ హాస్పిటల్లో అన్ని రకాల ఆధునిక వైద్య సదుపాయాలు లభ్యమవుతున్నాయని, దీని వల్ల దీర్ఘదూరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మంచిర్యాలవాసులకు సమగ్ర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :