MEGA BLOOD CAMP : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి రక్త నిధి కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 55 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ (MANCHERIAL DCP A. BHASKAR) శిబిరాన్ని ప్రారంభించి, రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందించారు. రెడ్ క్రాస్ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్తో కలిసి రక్తదాతలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ… రెడ్ క్రాస్ సంస్థ సేవలను కొనియాడారు.

జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ (CH. MAHENDAR) మాట్లాడుతూ… రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో, జిల్లాలో మరిన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శరత్ బాబు జన్మదినం సందర్భంగా తమ మిత్ర బృందంతో కలిసి రక్తదానం చేశారు. వారిని రెడ్ క్రాస్ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, ఏఎస్ఐ జి. నందయ్య, రెడ్ క్రాస్ సొసైటి కోశాధికారి కె. సత్యపాల్ రెడ్డి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, యెడ్ల కిషన్, డాక్టర్ ప్యియాంక సక్సేనా, డాక్టర్ స్పందన తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :