- మంచిర్యాల ఐబీ నుంచి మొదలు…
VHP : విశ్వహిందూ పరిషత్ (VHP), భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఈ నెల 12న వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ (VHP) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు (DIST. PRESIDENT) రేవెల్లి రాజలింగు వెల్లడించారు. గురు వారం నస్పూర్ ప్రెస్ క్లబ్ (PRESS CLUB) లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంచిర్యాలలోని హనుమాన్ జంక్షన్ (HANUMAN JUNCTION) ఐబీ చౌరస్తా (IB CHOWRASTA) నుంచి శనివారం సాయంత్రం 5 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ యాత్రలో హనుమాన్ మాలధారణ చేసిన వారితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ (VHP) జిల్లా కార్యదర్శి (SECRETARY) వేముల రమేష్, ఉపాధ్యక్షురాలు (VICE PRESIDENT) గొట్టిపత్తి కనకతార, విద్యాసాగర్, సురేష్, ముత్యం పద్మ, ముత్యం సంధ్యారాణి, లక్కర్స్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :