Operation Sindhur: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూ, భారత సైన్యం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పహల్గామ్లో జరిగిన దాడిలో, ఉగ్రవాదులు హిందువులే లక్ష్యంగా మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. టెర్రరిస్టుల దాడితో చాలా మంది మహిళలు వితంతువులుగా మారారు. ప్రతీకారంగా
అందువల్ల, భారతదేశం తీసుకున్న చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించిన ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు.
ముందే హెచ్చరించిన మోడీ
ఇటీవల, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. భారతదేశం దీనిపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినప్పటి నుండి, భారత ప్రభుత్వం, సాయుధ దళాలు దాడికి సన్నద్ధమవుతున్నాయి. ఇటీవల, దేశ రాజధాని ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ త్రివిధ సైన్యాధిపతులతో సమావేశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు, ఉమ్మడి ఆపరేషన్ కింద, భారతదేశంలోని త్రివిధ దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. దీనితో, పాకిస్తాన్ గర్వం పూర్తిగా దెబ్బతింది.
బీహార్ గడ్డ నుంచే ప్రకటన
ఈ ఉగ్రవాద దాడిలో ఒకరు తమ కొడుకును కోల్పోయారని, మరొకరు తమ సోదరుడిని కోల్పోయారని, మరికొందరు తమ జీవిత భాగస్వామిని కోల్పోయారని ప్రధానమంత్రి మోదీ బీహార్ లో ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో కొందరు బెంగాలీ మాట్లాడేవారు, కొందరు కన్నడ మాట్లాడేవారు, కొందరు మరాఠీ మాట్లాడేవారు, కొందరు ఒరియా మాట్లాడేవారు, కొందరు గుజరాతీ మాట్లాడేవారు, కొందరు బీహార్కు చెందినవారు. దేశ ప్రజలంతా దుఃఖం ఉన్నారు.. మా కోపం కూడా అలాగే ఉంది. ఈ దాడి నిరాయుధులైన పర్యాటకులపైనే కాకుండా దేశ శత్రువులు భారతదేశ ఆత్మపై దాడి చేయడానికి ధైర్యం చేశారని పేర్కొన్నారు.
ఉగ్రవాదుల మిగిలిన భూమిని నాశనం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తి ఇప్పుడు ఉగ్రవాదుల పీచమణిచేందుకు సిద్ధమైందన్నాను . తాను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఈ దాడి చేసిన ఉగ్రవాదులు, ఈ దాడికి కుట్ర పన్నిన వారు వారు ఊహించిన దానికంటే భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నారు .తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ రోజు బీహార్ నుంచి దేశంతో పాటు మొత్తం ప్రపంచానికి చెబుతున్నాను, భారతదేశం ప్రతి ఉగ్రవాదిని, వారిని ప్రోత్సహిస్తున్నవ వారిని ఎక్కడున్నా వదలబోమని, తప్పకుండా శిక్షిస్తుందని, ఎక్కడున్నా వెంటాడి, వేటాడుతామని స్పష్టం చేశారు.
అనంతరం పలుమార్లు త్రివిధ దళాలతో ప్రధాని సమావేశమయ్యారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రకటించారు. యుద్ధం ఎప్పడు చేస్తారో. ఏ టైమ్ కు చేస్తారో మీరే నిర్ణయించుకోవాలని, సైన్యానికి పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చారు. ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా లక్ష్యిత దాడులకు దిగింది.