NEW COMMITTEE : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూర్ గ్రామ రామాలయం నూతన కమిటీని గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ గౌరవ అధ్యక్షులుగా కొండపెల్లి సత్యనారాయణ రావు, తోట సరేందర్, ముత్తె లక్ష్మీకాంతంలు ఎన్నిక కాగా నూతన అధ్యక్షుడిగా కొండపెల్లి ప్రకాశ్ రావు, ఉపాధ్యక్షులుగా తోట లక్ష్మణ్, శనిగారపు సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా ఆసం హన్మండ్లు, ప్రచార కార్యదర్శిగా అమరకొండ పృథ్వీరాజ్, కోశాధికారిగా గాజుల గౌతమ్, సహాయ కార్యదర్శులుగా దాసండ్ల బాపు, లెక్కల మొగిలి, చొప్పదండి వెంకటేష్, గొల్లెన వినోద్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా బట్టిపెల్లి మల్లేశం, కొత్తపెల్లి దుబ్బయ్య, మేడి లచ్చన్న, దాసరి సుధాకర్ (పెద్ద), జంగం రాయమల్లులు ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను గ్రామ సర్పంచు దాసరి పురుషోత్తం, ఉప సర్పంచు చిరుత ప్రభాకర్ లతో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
– శెనార్తి మీడియా, ధర్మపురి :
