VHP : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని విద్యానగర్ లో శుక్ర వారం వీ హెచ్ పీ మాతృశక్తి సభ్యులు సత్సంగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిషత్ జిల్లా కార్యదర్శి వేముల రమేష్ హాజరై మాట్లాడారు. హిందువులు కులాలు, వర్గాలుగా విడిపోకుండా సంఘటితం కావాలని సూచించారు. హిందువులు జాగృతం కావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. అందరు ఐకమత్యంగా ఉండాలని, ఒకరికొకరు సహాయ సహకారాలు అందజేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చిన్నారి సుందిళ్ల సాన్వి ‘అమ్మ’ మీద పాడిన పాట అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టిపతి కనక తార, నగర కార్యదర్శి కొండపర్తి సంజీవ్, మాతృశక్తి సంయోజిక ముత్యం పద్మ, సహ సంయోజిక ముత్యం సంధ్యారాణి, నగర సహా కార్యదర్శి విద్యాసాగర్, సభ్యులు బుద్దె గట్టక్క, కాండ్రపు చంద్ర కళ, నీలమ్మ, రాజేశ్వరి, సంధ్య, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :