MLA Harish Babu: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం పారిగాంలో జై శివాజీ యూత్(Jai Shivaji Youth_ ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్ను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు (MLA Harish Babu) రిబ్బన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతాయని తెలిపారు. యువత క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చనకపురే లావణ్య, నీరటి సత్యనారాయణ, ఒడ్డెటి నాని, మాజీ సర్పంచ్ చౌదరి నానాజీ, ఎలుముల శంకర్, విలాస్, అశోక ఆర్య, స్వప్నిల్, దివాకర్, ఉద్ధవ్, శేఖర్, మనోజ్, ప్రశాంత్, సాయి, ధనరాజ్, సంతోష్, కుషబ్ రావు, బావుజీ పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, ఆసిఫాబాద్