MLA PSR : మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరాన మహాప్రస్థాన నిర్మాణ పనులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శని వారం సాయంత్రం పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని, గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఎల్ఏ వెంట సంబంధిత శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :