- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
MLA PSR : మంచిర్యాల నియోజక వర్గంలో యాసంగి సీజన్ లో వ్యవసాయ అవసరాలకు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిస్తున్నామని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. దండేపల్లి మండలం గుడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు యాసంగి పంటకు సాగు నీరు అందించడం కోసం ఆదివారం తానిమడుగు గ్రామం వద్ద 30వ డిస్ట్రిబ్యూటరి కెనాల్ నుంచి హజీపూర్ మండలం 42వ డిస్ట్రిబ్యూటరి కెనాల్ వరకు నీటిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మాది ప్రజా ప్రభుత్వమని, ప్రతి రైతుకు అండగా ఉంటామన్నారు. వ్యవసాయ అవసరాలకు గూడెం లిఫ్ట్ ద్వారా అందిస్తున్న సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని విడతలవారీగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల