MLA
అధికారులతో మాట్లాడుతున్న ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు

MLA PSR : విద్యా, వైద్య రంగ కేంద్రంగా అభివృద్ధి చేస్తా…

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

MLA PSR : మంచిర్యాల నియోజక వర్గాన్ని విద్యా, వైద్య రంగ కేంద్రంగా అభివృద్ధి చేస్తానని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సోమవారం కాలేజ్ రోడ్ లో నిర్మిస్తున్న స్మశాన వాటిక పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉన్నతమైన విద్య, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లే పరిస్థితిని తగ్గించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీ మేరకు మంచిర్యాలను అభివృద్ధిలో ముందుంచుతానన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం నూతన రేషన్ కార్డులు అందజేస్తామని, ఇందులో భాగంగానే అర్హులైన సింగరేణి విశ్రాంత కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో స్మశాన వాటిక నిర్మాణం జరుగుతోంది. శివరాత్రికి ప్రారంభిస్తామని, సౌర విద్యుత్, 12 రోజుల ఖర్మ ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఆరోపణలు అవాస్తవం…

గోదావరి నదిలో తీసిన ఇసుక, ఒడ్డున తీసిన మట్టిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించామని ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతి పక్షాలు అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని, అభివృద్ధికి సహకరించాలే కానీ అనవసర వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

PSR
పనులను పరిశీలిస్తున్న ఎంఎల్ఏ ప్రేం సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

ఫిబ్రవరిలో జిల్లాకు ఉప ముఖ్యమంత్రి
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు మంచిర్యాలకు రానున్నారని ఎంఎల్ఏ పీఎస్ఆర్ తెలిపారు. పురోగతి లో ఉన్న అభివృద్ధి పనులు, పట్టణ పరిస్థితిని పరిశీలించనున్నారని, వారి పర్యటన ద్వారా నియోజక వర్గానికి అదనపు నిధులు మంజూరు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎల్ఏ వెంట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *