bhoomi pooja
bhoomi pooja

Bhoomi Pooja : వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ

Bhoomi Pooja : కేశవపట్నం లో వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ఎంతో ప్రాశస్త్యం గల ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. రూ. 50 లక్షల దేవాదాయశాఖ నిధులతో ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లె ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాక అదనపు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగోని బస్వయ్యగౌడ్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ, ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, డైరెక్టర్ గాజల వెంకటేశ్వర్లు, తనుకు ప్రభాకర్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మొలంగూరి సదానందం, తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా,శంకరపట్నం :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *