KNR AC
ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్

EVM GODOWN : ఈవీఎం గోదాంను పరిశీలించిన అదనపు కలెక్టర్

EVM GODOWN : కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న ఈవీఎం (EVM) గోదాములను గురు వారం అదనపు కలెక్టర్ (ADDITIONAL COLLECTOR) లక్ష్మీ కిరణ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం (EVM), వివిప్యాట్ (VVPAT) గోడౌన్ లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికను పంపిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఈవిఎం (EVM) ల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవిఎం గదులను, అక్కడ భద్రత ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి పర్యవేక్షించారు. ఈవిఎం (EVM) గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో (RDO) మహేశ్వర్, ఏఓ (AO) సుధాకర్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, కరీంనగర్ :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *